
కాగా, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తే కనుక తమకు అభ్యంతరం లేదని సీబీఐ కూడా చెప్పింది. దీంతో దేశంలోని మీడియా సంస్థలన్నీ జయలలితకు బెయిల్ మంజూరైందంటూ వార్తలు ప్రసారం చేశాయి. అలా జరిగిన కాసేపటికే బెయిల్ ఇవ్వడం లేదంటూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది
అమ్మకోసం... అభిమానుల పడిగాపులు
అనుకున్నట్లే అమ్మ బయటకు వస్తుందని అనుకున్న అభిమానులకు ఒకరు కోర్టునుంచి బయటకు వచ్చి .. అమ్మకు బెయిల్ వచ్చినట్టే అని చెప్పగానే... వార్తా చానల్లు.. జయకు బెయిల్ ఇచ్చినట్లు ఊదరగొట్టాయి.. అంతేగాదు అభిమానులు.. కూడా టపాసులు.. కేరింతలు కొట్టారు.. కొద్దిసేపటికే అంతా తూచ్ బెయిల్ రాలేదని అనగానే... అందరూ ఒక్కసారి నిరాశ్రయులయ్యారు. ర్యాలీలు... పడిగాపులు... బాణసంచా కాల్చిన వారు బోరున విలపించారు.
No comments:
Post a Comment