సువర్ణముఖి (విజయనగరం జిల్లా)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రవహించే నది గురించి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, శ్రీకాళహస్తి మీదుగా ప్రవహించు నది కొరకు, సువర్ణముఖి (చిత్తూరు జిల్లా) చూడండి.
సువర్ణముఖి నది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించి, తూర్పుదిక్కుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో, సంగం దగ్గర నాగావళి నదిలో కలుస్తుంది.
నదీ మార్గం, ప్రాజెక్టులు
[మార్చు]సువర్ణముఖి నది ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండలం కొండశేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుది. జిల్లాలో మొత్తం 17 కి.మీ. మేర ప్రవహించి వంగర మండలంలోని సంగం గ్రామం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది.దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది. ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-08.